తిరుమల : తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల (Brahmotsavam) సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు (Darsan cancell) చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా తిరుమల(Tirumala) కు వస్తారని పేర్కొన్నారు.
ఈ కారణంగా సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించింది. దాదాపు పది రోజుల పాటు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. ఈ రోజుల్లో బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామని, భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.
టీటీడీ ఆదాయం రూ. 4.37 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 63,202 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 34,057 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.37 ఆదాయం వచ్చిందని వెల్లడించారు.