(Somu Veerraju) విజయవాడ : ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ రాష్ట్రా బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు స్టిక్కర్ బాబుగా మారగా.. ఇప్పుడు జగన్ డబుల్ స్టిక్కర్ ముఖ్యమంత్రయ్యారని దుయ్యబట్టారు. కేంద్రం ఇస్తున్న నిధులతో పథకాలను కొనసాగిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆయా పథకాలకు మాత్రం జగన్ పేరు పెట్టడం ఏంటి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం 36 పథకాలకు జగన్ పేరు పెట్టారని ఫైరయ్యారు.
అంబేద్కర్ నడయాడిన ఈ ప్రాంతాన్ని పంచ తీర్ధాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని, భారత రాజ్యాంగం విశిష్టత ను వివరిస్తూ ప్రధానమంత్రి మోదీ గొప్ప నిర్ణయం తీసుకున్నారని సోము వీర్రాజు తెలిపారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపైన ప్రజలు పూర్తి విశ్వాసం చూపుతున్నారని, సామాన్యుడి కి ఓటు హక్కు కల్పించడంతోనే విప్లవాత్మక మార్పులు వచ్చాయని వెల్లడించారు. ఇందిరాగాంధీ వంటి వ్యక్తులనే ప్రజలు ఓడించడం మన ప్రజాస్వామ్యం గొప్పదనానికి నిదర్శనమన్నారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..