విశాఖపట్నం : ఆగ్నేయ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటి గమ్యాలను కుదించారు. ఈ మేరకు వాల్తేరు సీనియర్ డీసీఎం ఒక ప్రకటన విడుదల చేశారు. రైళ్లు రద్దైన విషయాన్ని, గమ్యాల మార్పులను ప్రయాణికులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
లఖోలి-రాయ్పూర్ మధ్య రెండో లైన్ పనులు, నయా రాయపూర్ స్టేషన్, యార్డు ఆధునీకరణ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేస్తున్నారు. సెప్టెంబర్ 11న విశాఖ-కోర్బా , 12న కోర్బా-విశాఖ, 6 నుంచి 12 వరకు విశాఖ-దుర్గ్, 7 నుంచి 13 వరకు దుర్గ్-విశాఖ రైళ్లను రద్దు చేశారు. అలాగే, 6 నుంచి 12 వరకు విశాఖ-రాయపూర్ రైలు, 7 నుంచి 13 వరకు రాయపూర్-విశాఖ రైళ్లను మహాసముండ-రాయపూర్-మహాసముండ స్టేషన్ల మధ్య రద్దయ్యాయి.
ఈ నెల 8, 11 తేదీల్లో తిరుపతి-బిలాస్పూర్ రైలు, 10, 13న బిలాస్పూర్-తిరుపతి రైలు, ఈ నెల 6, 8, 9, 10, 13, 15 తేదీల్లో పూరీ-అహ్మదాబాద్ రైలు, 8, 10, 11, 12, 15 తేదీల్లో అహ్మదాబాద్-పూరీ రైళ్లను టిట్లాఘర్, సంబల్పూర్, జార్సుగూడ మీదుగా దారి మళ్లించారు. ఈ నెల 12న విశాఖ- కోర్బా ఎక్స్ప్రెస్ 5 గంటలు, 8, 15 తేదీల్లో విశాఖ-నిజాముద్దీన్ సమతా ఎక్స్ప్రెస్ 2 గంటలు, 12న హజ్రత్ నిజాముద్దీన్-విశాఖ సమతా ఎక్స్ప్రెస్ 5 గంటలు, 15న తిరుపతి-బిలాస్పూర్ 4 గంటలు, విశాఖ-భగత్ కీ- కోఠి 5 గంటలు ఆలస్యంగా బయలు దేరుతాయి.