అమరావతి : ఏపీలో సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ( Tenth Exams ) ప్రారంభ మయ్యాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగనున్నాయి. 18న సెకండ్ లాంగ్వేజ్, 23న మ్యాథ్స్, 25న ఫిజిక్స్, 28న బయోలాజికల్ సైన్స్, 30 సోషల్ స్టడీస్, 31న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 , ఏప్రిల్ 1న ఆపన్షల్ సబెక్ట్ పరీక్షలు జరుగుతాయని ఉన్నత విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.
కాగా సోమవారం కడప జిల్లా బి.కోడూరులోని పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి పాము (Snake) రావడం కలకలం రేపింది. పామును చూసిన విద్యార్థులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. వెంటనే అక్కడి సిబ్బంది పామును చంపి బయటపడేయతంతో విద్యార్థులు, పరీక్షల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.