అమరావతి : షట్లర్ పీవీ సింధు ఇవాళ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్లో సాధించిన కాంస్య పతకాన్ని డీజీపీ తిలకించి
సింధును అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయిలో పతకం సాధించి సింధు ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసిందన్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి దేశం, రాష్ట్ర కీర్తి-ప్రతిష్టలను మరింత పెంచాలని ఆకాంక్షించారు. పీవీ సింధుతోపాటు ఆమె తల్లిదండ్రులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మహిళ భద్రతకు పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలను సింధు కొనియాడారు. ఆంధ్ర ప్రదేశ్లోని ప్రతి మహిళ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు.