అమరావతి : కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో సంచరిస్తున్న పులి జాడ కోసం అటవి శాఖ అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత 20 రోజులుగా అధికారులు, సిబ్బంది పులిని పట్టుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ దానిని పట్టుకోలేక పోతున్నారు. పరిసర ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేసినా అక్కడికి వస్తున్న పులి ఎరకు లొంగక తిరిగి అక్కడి నుంచి జారు కుంటుంది.
అయితే పులి పులి సంచారంతో మండలంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. నిన్న సూరారం మెట్ల మీద పులి ఆనవాళ్లను అటవిశాఖ సిబ్బంది గుర్తించారు. 10 రోజుల తర్వాత మళ్లీ పశువులపై పులిదాడి చేయటం కలకలం రేపుతుంది. పులి తోటపల్లి రిజర్వ్ ఫారెస్టు వైపు వెళ్తుందని అటవి సిబ్బంది అంచనా వేశారు.
మరోవైపు రాష్ట్ర అటవిశాఖ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించకపోవడంతో పులిని పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి షూటర్లను రప్పిస్తున్నారు.పులి జాడను సాంకేతిక సహకారంతో పట్టుకునేందుకు ఎస్టీసీఏకి అధికారులు పలు ప్రతిపాదనలు చేశారు.