Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు ధ్యాన, యోగా మందిరాలతోపాటు మౌలిక వసతులను కల్పించేందుకు శివసదన్ ఆశ్రమ నిర్మాణం చేపడుతున్నట్లు తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి చెప్పారు. శనివారం క్షేత్రపరిధిలోగల రుద్రపార్కు సమీపంలో శివసదన్ ఆశ్రమ నిర్మాణం చేపట్టేందుకు శాస్త్రోక్తంగా భూమిపూజా కార్యక్రమం నిర్వహించారు.
విజయవాడ, గుంటూరు నగరాల భక్తులు హరివెంకట సతీష్, ఉమారాణి దంపతుల ఆధ్వర్యంలో గణపతిహోమం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్బంగా శివస్వామి మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి స్వామిఅమ్మవార్ల దర్శనాలకు వచ్చే సామాన్య భక్తులకు ఆధ్యాత్మిక సేవలతోపాటు కనీస మౌలిక వసతులను కల్పించేందుకు తమ వంతు కృషిలో భాగంగా ఆశ్రమ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిధర్, శేఖర్, శ్రీను, శివ, నాగార్జునస్వామి తదితరులు ఉన్నారు.