అమరావతి : తనకు రాష్ట్రప్రభుత్వం భద్రత కల్పించకపోవడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తనకు చేడు చేసేందుకే రక్షణ కల్పించడం లేదంటూ మండిపడ్డారు. బుధవారం ఆమె హైదరాబాద్ నుంచి గన్నవరానికి చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
పీసీసీ అధ్యక్షురాలికి భద్రత(Security) కల్పించడం లేదంటే అసలు ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి ఉందా అంటూ జగన్ (Jagan) ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్తానికి రక్షణ ఉంటే సరిపోతుందా ? పెద్దపెద్ద హోటళ్లు, గడుల్లో ఉంటూ రక్షణ కల్పించుకుంటే ప్రతిపక్షాలకు, ప్రజలకు రక్షణ కల్పించే అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి్ంది చాలని అన్నారు. ఈసారైనా అసెంబ్లీలో ప్రత్యేక హోదా(Special Status), పోలవరం(Polavaram), రాజధాని(Capital) పై చర్చ జరిపి తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు.