కాకినాడ: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని పెద్దాపురం మండలం జీ.రాగంపేలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ట్యాంకర్ను శుభ్రం చేయడానికి దిగిన కార్మికులు.. ఒకరి తర్వాత ఒకరు ఊపిరాడక మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఐదుగురిని పాడేరుకు చెందినవారిగా గుర్తించారు. మిగిలిన ఇద్దరు పెద్దాపురం మండలంలోని పులిమేరు వాసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.