అమరావతి : సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మరో 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 14న నర్సాపూర్-విజయవాడ, విజయవాడ-నర్సాపూర్, మచిలీపట్నం-గుడివాడ, గుడివాడ-మచిలీపట్నం,మచిలీపట్నం-గుడివాడ 14న విజయవాడ నుంచి మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి విజయవాడకు వెళుతుంది.
మరోవైపు జనవరి 1 నుంచి 31 వరకు కొన్ని రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లలో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.