అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో జరిగిన ఘోరప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగి పడ్డ ఘటనతో ఐదుగురు సజీవదహనమయ్యారు. పారిస్లో ఉన్న ఏపీ సీఎం ఘటన విషయాలు తెలుసుకుని మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని అధికారులకు ఆదేవించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రకటించారు. గుడ్డంపల్లికి చెందిన కూలీలు ఆటోలో వ్యవసాయ పనుల కోసం చిల్లకొండయ్య పల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.