శ్రీశైలం : శ్రీగిరులపై భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లతో పాటు పరివార దేవతలకు పష్ఠి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఈవో లవన్న తెలిపారు. లోక కల్యాణం కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో కొలువైన కుమారస్వామికి పంచామృతాభిషేకాలు విశేష పుష్పార్చనలు చేశారు. కొవిడ్ మహమ్మారి ప్రభావం తొలగిపోయి ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని సంకల్పం పఠించినట్లు ప్రధానార్చకులు భద్రయ్య తెలిపారు.