తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.స్వామివారి దర్శనానికి కొండపై 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 61,368 మంది భక్తులు దర్శించుకోగా 25,578 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.96 కోట్లు వచ్చిందన్నారు.
రేపు డయల్ యువర్ ఈవో..
రేపు తిరుమల అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని తెలిపారు. భక్తులు తమ సందేహాలను, సూచనలను ఈవో ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని సూచించారు. భక్తులు 0877-2263261 అనే నెంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు.