హైదరాబాద్ : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో పాటు వారాంతపు రద్దీ దృష్ట్యా భక్తులకు సర్వదర్శనానికి రెండు రోజుల సమయం పడుతున్నది. సాధారణ భక్తులకు మరింత ఎక్కువ దర్శన సమయం కల్పించేందుకు మార్చి 29న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది.
ఇందుకోసం మార్చి 28న సోమవారం ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించబోయమని ఇప్పటికే టీటీడీ తెలిపింది. ఈ నేపథ్యంలో తిరుమలలో దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉండడంతో సర్వదర్శనం భక్తులు తదనుగుణంగా తమ తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాలని టీటీడీ కోరింది.