తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం, ఆపదమొక్కులవాడు వేంకటేశ్వరస్వామిని (Lord Venkateshwar) దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు తరలివచ్చి 20 కంపార్టుమెంట్లో వేచియున్నారు.
టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం(Sarva darshan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 83,960 మంది భక్తులు దర్శించుకోగా 32,342 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 2 96 ఆదాయం వచ్చిందని తెలిపారు.