తిరుపతి : టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు పండుగ వాతావరణం కనిపించేలా పాఠశాల పరిసరాలను రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంధ్య సంక్రాంతి పండుగ విశిష్టతను,భారతీయ సంప్రదాయాలను, సంస్కృతులను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు.
ఈ సందర్భంగా రంగవల్లుల పోటీల విజేతలకు, సాంస్కృతిక ప్రదర్శన పోటీల విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.