గుంటూరు : బీసీలను వంచించేందుకు ఏపీ మాజీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మరోసారి పగటి వేషగాడిలా వస్తున్నాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishnareddy) అన్నారు. అమలు చేయని హామీలు గుప్పిస్తూ మళ్లీ జనంలోకి వస్తున్నాడని బుధవారం మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు.
రుణమాఫీ పేరుతో రైతులను డ్వాక్రా రుణాలంటూ మహిళలను చంద్రబాబు మోసం చేశాడని ఆరోపించారు. కానీ సీఎం జగన్ తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు భరోసాగా నిలిచారని చెప్పారు. మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావిస్తూ హామీలన్నీ నెరవేరుస్తున్నారని అన్నారు. బీసీలను మరోసారి వంచించేందుకు వస్తున్న చంద్రబాబును నమ్మవద్దని కోరారు. గతంలో నాయీ బ్రాహ్మణుల తోకలు కట్చేస్తానన్న విషయం బీసీలు మరిచిపోలేదని అన్నారు.
తనకున్న మీడియా బలంతో చంద్రబాబు అబద్దాలను నిజం చేయాలని చూస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. సీఎం జగన్ పారదర్శక పాలనతో ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. బీసీలంటే బ్యాక్బోన్ క్యాస్ట్స్గా తమ పార్టీ భావిస్తుందని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో జగన్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని జాబితాను పరిశీలిస్తే తెలుస్తుందని అన్నారు. వార్డు సభ్యుల నుంచి ఎంపీల వరకూ పెద్దసంఖ్యలో బీసీలకు పదవులు ఇచ్చి గౌరవించారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది బీసీలకు పలు పదవులు దక్కాయని గుర్తుచేశారు. పిల్లలకు కార్పొరేట్ చదువులు దక్కేలా అట్టడుగు స్ధాయికి సంస్కరణలను తీసుకువెళ్లారని వివరించారు.
Read More :
Thota Chandrasekhar | బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్నే.. ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్