అమరావతి : ఏపీలోని కడప శివారు మద్దిమడుగు తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. రామాపురం నుంచి కడప వైపు వెళ్తున్న ఆటోను ,కడప నుంచి రాయచోటికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.