Jayashankar statue | అమరావతి : అమరావతిలో( Amaravati) తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం(Jayashankar statue )ఏర్పాటు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ కన్వీనర్ రోహిత్ వక్రాల లేఖ రాశారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణలో పలువురు ఆంధ్ర నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.
మాజీ సీఎం రోశయ్య, రవీంద్ర భారతిలో సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, ఇటీవలే మైత్రి వైనంలో ఎన్టీఆర్ వంటి నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జయశంకర్ సార్ ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
అమరావతిలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ఏర్పాటు కోసం సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ కన్వీనర్ రోహిత్ వక్రాల
మరి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందా లేదా చూడాలి pic.twitter.com/DdCtUfsAiE
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2026