తిరుపతి: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో మరో సాంకేతిక పరికరం అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో పలమనేరుకు చెందిన పవన్ తయారుచేసిన రోబోను స్విమ్స్కు బహుకరించారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ రోబోను ప్రారంభించి స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మకు అందజేశారు. కొవిడ్ నేపథ్యంలో రోబోల ద్వారా రోగులకు సేవలు అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చైర్మన్ పేర్కొన్నారు. రూ. 50వేల ఖర్చుతోనే రోబోను తయారు చేయడం అభినందనీయమని చెప్పారు.