అమరావతి : ఏపీలో జరిగిన రోడ్డు్ వేర్వేరూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నంద్యాల జిల్లా(Nandyal District) అయ్యలూరు జాతీయ రహదారిపై రెండు ద్విచక్రవాహానాలు ఢీ కొనగా ఇద్దరు మృతి చెందారు. మృతులు నంద్యాల మసీదుపురానికి చెందిన వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
ఎన్టీఆర్ జిల్లా(NTR District) నందిగామ శివారు అనాసాగరం రహదారిపై జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సూపర్ లగ్జరీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.