అమరావతి : ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో దసరా పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని లారీ పందిళ్లపల్లి గ్రామం వద్ద ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు కమలాపురం మండలం నల్లింగాయపల్లె వాసులుగా గుర్తించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.