అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు.
జిల్లాలోని ప్యాపిలి మండలం పీఆర్పల్లి వద్ద వైసీపీ బ్యానర్లు తరలిస్తున్న వాహనం నుంచి పడి ఇద్దరు కూలీలు బేతంచర్ల వాసి సాయి శశాంక్(19), డోన్ వాసి బాషా (26) మృతి చెందారు. ప్రభుత్వ అభివృద్ధి గురించి గ్రామాల్లో ఫ్లెక్సీలు వేయించడానికి బ్యానర్లు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
,