అమరావతి : విజయనగరం(Vijayanagaram ) జిల్లా పూసపాటిరేగ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident ) లో ఇద్దరు అన్నదమ్ములు( Brothers) దుర్మరణం చెందారు. గొల్లపేట గ్రామానికి చెందిన అన్నదమ్ములు రమేష్ , సురేశ్ ద్విచక్రవాహనంపై వెళ్తూ ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్ను ఢీ కొన్నారు. ప్రమాదంలో ఇద్దరు మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.