అమరావతి : ఎన్టీఆర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. జిల్లాలోని నందిగామ మండలం అంబారుపేట సత్తెమ్మ గుడి వద్ద ఆగివున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ప్రమాదంలో వెంకటేశ్వరరావు, లక్ష్మణ్కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.