అమరావతి : జన్మదిన వేడుకలను ఉల్లాసంగా జరుపుకుని ఇంటికి బయలుదేరిన యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో పెనుమాకకు చెందిన సతీశ్రెడ్డి జన్మదినం సందర్భంగా రహదారిపై కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. వేడుకల అనంతరం ఐదుగురు యువకులు రెండు ద్విచక్రవాహనాలపై పెనుమాకకు బయలు దేరారు.
ఒక ద్విచక్రవాహనం అతివేగంతో వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో సతీశ్రెడ్డితో పాటు మరో ఇద్దరుయువకులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.