అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర మంత్రి సురక్షితంగా బయట పడ్డారు. ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్ రాత్రి ఒంగోలుకు వెళ్తుండగా కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న కార్లు ఢీ కొన్నాయి. కాన్వాయ్ మధ్యలో ఉన్న మంత్రి జోగి రమేష్ కారు కూడా బ్రేక్ వేయబోయి డివైడర్ ను ఢీకొంది. ఆయన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మంత్రికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఆయన మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.