అమరావతి : అనంతపురం జిల్లా గార్లెదిన్నె మండలం కనుంపల్లి వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లా నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఘటన జరిగింది. కూలి పనికోసం బెంగళూరులో ఉన్న ఇద్దరు మొహర్రం వేడుకల్లో పాల్గొని తిరుగుప్రయాణంలో ప్రమాదానికి లోనయ్యారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ప్రమాదంలో పెళ్లిబృందం సభ్యులకు గాయాలు
కృష్ణా జిల్లాలోని పాపులపాడు మండలం అంపాపురం జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడిన ఘటనలో పెళ్లి బృందంలోని ఐదుగురు సభ్యులకు తీవ్రగాయాలయ్యాయి. అత్తిలిలో రాత్రి వధువు ఇంటి వద్ద వివాహం కార్యక్రమంలో అనంతరం హైదరాబాద్కు బయలు దేరిన సమయంలో ఘటన జరిగింది.