అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద పెరుగుతుంది. నిన్న నైరుతీ పవనాల రాకతో ప్రాజెక్టుకు ఎగువభాగాన కురిసిన వర్షాలతో 23,644 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాల నుంచి 6300, సుంకేశుల జలాశయం నుంచి 8,554 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 8,760 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రసుత్తం ప్రాజెక్టులో 821.10 అడుగుల వరకు నీరు ఉంది.