అమరావతి : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతుండడంతో రెండో ప్రమాద హెచ్చరిక ను అధికారులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 15.70 అడుగుల వరకు నీటి మట్టం కొనసాగుతుం ది. డెల్టా కాల్వలకు 11 వేల క్యూసెక్కులు, సముద్రంలోకి 15.84 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడు దల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది .
జలాశయం 7 గేట్లు 10 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 1,94,284 క్యూసెక్కుల నీరు సాగర్కు విడు దల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2.77 లక్షల క్యూసెక్కుల ప్రవా హం వస్తుంది . శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా 884.30 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలకు 211.47 టీఎంసీలుగా కొనసాగుతుంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 32,983 క్యూసెక్కులు సాగర్కు విడుదల చేస్తున్నారు.