అమరావతి : లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డాడు. అల్లూరి జిల్లా అరకులోయ తహసీల్ కార్యాలయంలో ఇవాళ ఆర్ఐ అర్జున్ బాధితుడి నుంచి . రూ. 35వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. భూమి కోల్పోయిన లబ్ధిదారుల పరిహారం రిపోర్టు రాసేందుకు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
దీంతో ముందస్తు వ్యూహం ప్రకారం అధికారులు తహసీల్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్హ్యండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.