అమరావతి : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు నగరాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ లు విధిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో పలు దేవాలయాలు, పబ్లిక్ పార్కుల్లో ఆంక్షలు విధిస్తున్నారు. కోవిడ్ కారణంగా శ్రీశైలం దేవస్థానంలో పలు ఆంక్షలు అమలులోకి రానున్నాయి. అందులో భాగంగా నేటి నుంచి స్పర్శ దర్శనాలు,అన్న ప్రసాదవితరణ,పుణ్యస్నానాలు రద్దు చేశారు ఆలయ అధికారులు.
రేపటి నుంచి ఆన్లైన్లో ఆర్జిత సేవా టికెట్లు. శీఘ్ర,అతి శీఘ్ర దర్శన టికెట్లు ఆన్లైన్ ద్వారా పొందే అవకాశం కల్పిసున్నారు.