అమరావతి : డ్రైవర్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది. రాజమండ్రి అట్రాసిటీ కోర్టు ఎమ్మెల్సీ బెయిల్ పిటిషన్ను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్గా పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మే రెండోవారం దారుణ హత్యకు గురయ్యాడు.
హత్యకు ప్రధాన కారణం తానేనంటూ కోర్టులో లొంగిన ఎమ్మెల్సీ మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. అప్పటి నుంచి బెయిల్ కోసం పలుమార్లు వేసిన పిటిషన్లను రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు, ఏపీ హైకోర్టు తిరస్కరిస్తూ వస్తుంది. కాగా అనంతబాబు తరుఫు న్యాయవాది డిఫాల్ట్ బెయిల్ మంజూరు కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా డిసెంబర్ 12న విచారణకు రానున్నది .