అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వరదల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు తీసుకున్నామని ఏపీ హోం మంత్రి తానేటి వనితి తెలిపారు. మొత్తం 10 సహాయక బృందాలను రంగంలోకి దించి ప్రజలను ఆదుకున్నామని వెల్లడించారు. ఏపీకి ఎగువన ఉన్న రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని 554 గ్రామాలపై వరదలు ప్రభావం చూపాయని వివరించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి పనిచేస్తున్నారని అన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు. కోనసీమ జిల్లా విల్లి మండలంలోని ముక్తేశ్వరం-తొగరపాయ కాజ్వే వద్ద వరద పరిస్థితిని ఆమె పరిశీలించారు.