అమరావతి : ఆంధ్రప్రభుత్వం ఈఏపీసెట్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల తేదీలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. జులై 4 నుంచి 8వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, జూలై 11,12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏపీ వ్యాప్తంగా 134 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నామని ఆయన వివరించారు. తెలంగాణలోనూ నాలుగు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ఏప్రిల్ 11న పూర్తి వివరాలతో EAPCET నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇతర పోటీ పరీక్షల తేదీలకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ఉంటుందన్నారు. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. EAPCET ఫలితాలను ఆగస్టు 15 తర్వాత విడుదల చేస్తామని మంత్రి సురేశ్ వివరించారు. ఆగస్టు 15లోగా ఇంటర్ ఫలితాలను కూడా వెల్లడిస్తామని తెలిపారు. సెప్టెంబర్ రెండోవారంలో తరగతులను ప్రారంభించాలని భావిస్తున్నామని అన్నారు. పరీక్షా విధానం, ర్యాంకుల ప్రకటనలో మార్పుల్లేవని తెలిపారు.