అమరావతి : తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం మరింత తగ్గుముఖం పట్టింది. ఈ బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటి మట్టం 14.5 అడుగుల వరకు నీరు ఉంది. ఇక్కడి నుంచి 5,400 క్యూసెక్కుల నీటిని పంట కాలువలకు, సముద్రంలోకి 13.94 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రవాహం తగ్గుతుండడంతో రెండోస్థాయి హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
కాగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. జూరాల, సుంకేశుల నుంచి 2,22,935 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 879 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు సామర్ధ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.99 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం 21,729 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 10 వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 597 క్యూసెక్కులు, కల్వకుర్తికి 2,400 క్యూసెక్కులు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.