తిరుమల : తిరుమల (Tirumala) లో వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య తగ్గింది. రెండు కంపార్టుమెంట్లల( Compartments ) లో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం( Sarvadarsan) కలుగుతుందని టీటీడీ(TTD ) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 63,665 మంది భక్తులు దర్శించుకోగా 18,630 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం ( Hundi Income) రూ. 3.44 కోట్లు వచ్చిందని వివరించారు.