తిరుమల : తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan ) అవుతుందని టీటీడీ ( TTD ) అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఆపదమొక్కుల వాడు వేంకటేశ్వరస్వామిని బుధవారం 72,283 మంది దర్శించుకోగా 22,583 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 4.54 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.