హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): విశాఖలో ఓ రియల్టర్ కుటుంబం కిడ్నాప్నకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు రియల్టర్ శ్రీనివాస్తోపాటు ఆయన భార్య లోవ లక్ష్మిని బుధవారం కిడ్నాప్ చేశారు. విజయవాడకు చెందిన ఈ దంపతులు వ్యాపారం నిమిత్తం విశాఖ 4వ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు నెలలుగా నివాసం ఉంటున్నారు.
కిడ్నాపర్లు రూ.60 లక్షలు డిమాండ్ చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుండగులు ఐదుగురిని గురువారం అన్నవరం మండలం కత్తిపూడి వద్ద కారులో వెళ్తుండగా చాకచక్యంగా పట్టుకున్నారు. కిడ్నాపర్లు విజయవాడ వాసులేనని పోలీసుల విచారణలో వెల్లడైంది. లక్ష్మి-శ్రీనివాస్ సురక్షితంగా ఉన్నారు.