అమరావతి : పుట్టపర్తిని కాకుండా జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ప్రకటించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు మౌనదీక్షను ప్రారంభించారు. అంతకు ముందు పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పా ర్టీనాయకులతో కలిసి నల్ల కండువా ధరించి పాదయాత్ర నిర్వహించారు. దారిపొడువునా నినాదాలు చేశారు.
ఉద్యోగుల ఆందోళన నుంచి దృ ష్టిమరల్చేందుకే రాత్రికి రాత్రే కొత్త జిల్లాలను ప్రకటించారని బాలకృష్ణ ఆరోపించారు. స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులకు ధైర్యం ఉంటే పదవులకు రాజీనామా చేసి హిందూపురం జిల్లా కేంద్రం కోసం పోరాడాలని సూచించారు. తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లు , ఇతర ప్రజాప్రతినిధులు , తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నీచమైన రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.