తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో మలయప్పస్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
సూర్యనారాయణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు రథ సప్తమి వేడుకలను టీటీడీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నేడు శ్రీవారు సప్తవాహనాలపై దర్శనం ఇవ్వనున్నారు. శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహిస్తారు. సాయంత్రం 5 గంటలకు స్వామివారు వెండి రథంపై ఊరేగనున్నారు. రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు ముగుస్తాయి.