Rare Kachidi Fish | కేవలం రెండే చేపలు మత్స్యకారులను లక్షాధికారులను చేశాయి. ఒక్కో చేప రూ.2లక్షల ధర పలుకవడంతో ఆ మత్స్యకారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో వేటకు వెళ్లగా.. రెండు కచ్చిడీ చేపలు చిక్కాయి. అవి అరుదైన చేపలు. వీటిని కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లి పాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో వేలానికి పెట్టారు. ఓ వ్యాపారి రెండు చేపలను రూ.4లక్షలకు కొనుగోలు చేశారు.
ఈ చేపలకు ఎందుకంత గిరాకీ అంటే.. ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్ను మందుల తయారీతో పాటు శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారం తయారీలో వాడుతారు. దారం కాలక్రమేణా శరీరంలో కలిసిపోతుంది. పిత్తాశయంతో పాటు ఊపిరితిత్తులను మందుల తయారీలోనూ వినియోగిస్తారు. అంతేకాదు విలువైన వైన్ తయారు చేసే పరిశ్రమల్లో ఈ చేపను ఉపయోగిస్తారని మత్స్యకారులు పేర్కొన్నారు. చేప రెక్కలు వైన్ను క్లీన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని.. అందుకే ఈ చాపకు అంత డిమాండ్ ఉంటుంది.
అంతర్జాతీయం మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. ఇక ఈ కచ్చిడీ చేప శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. ఈ చేప పొట్ట భాగంలో ఉండే అవయవాలకు ఔషధ గుణాలుంటాయని మత్స్యకారులు తెలిపారు. ఈ చేపలు అరుదుగా వలలో పడుతాయని చెప్పారు. కచ్చిడీ చేపను గోల్డెన్ ఫిష్గా పిలుస్తారని.. పేరుకు తగ్గట్లుగా బంగారం తరహాలోనే విలువైందని పేర్కొన్నారు. ఈ రకం చేపలు ఎప్పుడూ ఒకేచోట స్థిరంగా ఉండవని.. ఒకచోటు నుంచి మరో చోటికి వెళ్తుంటాయని తెలిపారు.