AP News | అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ నాయకుల మధ్య విబేధాలు బయటపడ్డాయి. రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. క్యాంటీన్ ప్రారంభంలో కత్తెర కోసం టీడీపీ నాయకులు కొట్టుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
రాజంపేటలోని పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభించేందుకు గురువారం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం ముఖ్య అతిథులుగా వెళ్లారు. ఈ క్రమంలో రిబ్బన్ కట్ చేయడానికి బాలసుబ్రమణ్యం సిద్దమయ్యారు. అదే సమయంలో జగన్మోహన్ రాజు కత్తెర తీసుకుని రిబ్బన్ కట్ చేయడానికి ముందుకొచ్చారు.కానీ జగన్మోహన్ రాజు చేతిలోని కత్తెర తీసుకుని బాలసుబ్రమణ్యం రిబ్బన్ కట్ చేసి, లోపలికి దూసుకెళ్లారు.
కూటమి ఎక్కువ ఐతే కత్తెర దగ్గర కూడా గొడవలే జరుగుతాయి.. 🙈🤭
అది అలా కలిసిమెలిసి కొట్టుకుంటూ మమ్మల్ని ఎంటర్టైనర్ చేస్తూ ఉండాలి. 🤭🙈😆🤣 #SaveAPFromKutami pic.twitter.com/jNLZjJyEL6
— Krishnaveni Paleti (@KrishnaveniYCP) September 19, 2024
క్యాంటీన్ లోపలికి వెళ్లే క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా దాడులకు కూడా తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.