అమరావతి : రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వానలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు అమరావతిలో ఉన్న వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దక్షిణ, ఆగ్నేయ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ప్రధానంగా కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, రాయలసీమలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
శనివారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. ఎగువ ప్రాజెక్టులైన జూరాల, సుంకేసుల నుంచి 1,32,829 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి చేరుతున్నది. 10 అడుగుల ఎత్తులో తెరిచిన 2 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 55,966 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు.