అమరావతి : ఏపీలో మహిళలపై జరుగుతున్న దౌర్జాన్యాలను నిరసిస్తూ టీడీపీ తెలుగు మహిళ ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. విజయవాడలోని మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు ముట్టడించడంతో ఉద్రిగ్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్యాలయం వద్ద పోలీసు బలగాలను మోహరించారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కమిషన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
ఈ నిరసనలో విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనిత మాట్లాడుతూ .. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కమిషన్కు విజ్ఞాపన పత్రం ఇచ్చేందుకు మహిళలు కార్యాలయంలోకి వస్తే కనీసం మర్యాద లేకుండా అనుమతించక పోవడం దారుణమని అన్నారు. మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసే హక్కు తమకుందని పేర్కొన్నారు .
కాగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై అనుచితంగా ప్రవర్తించారని చంద్రబాబు, బొండ ఉమకు కమిషన్ నోటీసులు చేయగా నోటీసులు ఇచ్చే అధికారం మహిళా కమిషన్కు లేదని, విచారణకు హాజరుకావడం లేదని తెలిపిన బొండా ఉమ స్పష్టం చేశారు.