అమరావతి : తొలగించిన కేజీహెచ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఏపీకి చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం నిరసన చేపట్టారు. విశాఖపట్నం నగరంలోని సీతమ్మధారలో మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇంటి ముట్టడికి ప్రయత్నించిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు.
ముందస్తూ సమాచారం లేకుండా కేజీహెచ్లో పనిచేస్తున్న 65 మంది ఉద్యోగులను తొలగించడం విచారకరమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు నెలల క్రితం మంత్రికి వినతి పత్రం అందజేయగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్కు మౌఖిక ఆదేశాలు జారీచేసినా ఇంతవరకు స్పందించ లేదని వారు వాపోయారు. తక్షణమే తమను విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి అవంతి ఇంటిలో లేకపోవడంతో ఆయన నివాసానికి వినతి పత్రాన్ని అంటించారు.