అమరావతి : పార్లమెంట్లో ప్రవేశపెట్టే విద్యుత్ సవరణ బిల్లు 2022ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి , కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర పట్టణాల్లో మధ్యాహ్నా భోజన విరామ సమయంలో ధర్నాను నిర్వహించారు.
విద్యుత్, సహజ ఇంధన వనరులను స్వదేశి, విదేశి ప్రైవేట్ పెట్టుబడి దారులు దారాదత్తం చేయరాదని నినాదాలు చేశారు. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు.