అమరావతి : ప్రధాని మోదీ ఏపీ పర్యటనను నిరసిస్తూ విశాఖపట్నంలో స్టీల్ప్లాంట్ ప్రధానద్వారం వద్ద ఉద్యోగులు, కార్మికులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణను నిరసిస్తూ గత 550 రోజులుగా పోరాటాలు చేస్తుంటే స్పందించకుండా ఏపీలో ప్రధాని పర్యటన కొనసాగించడంపై కార్మికులు నిరసన తెలిపారు. కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నల్ల బెలూన్లు ఎగరవేయాలని పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి నల్లబెలూన్లతో వచ్చిన కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలను ఏ మేరకు తీర్చారని ఆరోపిస్తూ ఆమె నిరసన తెలిపారు. ఏలూరులో నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.