అమరావతి: ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోను థర్డ్ పర్సన్ ఎవరో షూట్ చేసి పంపడంతో వైరల్గా మారిందని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెల్లడించారు. ఆ వీడియో ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్ అని చెప్పారు. కొందరు అమెరికాలోని ఓ ల్యాబ్లో థర్డ్ పర్సన్ షూట్ చేసిన వీడియోను పంపించి నివేదిక పొందారని, ఓ ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చిన నివేదికకు ఎలాంటి ప్రామాణికత లేదని, ఆథెంటిక్ కూడా కాదని, విలువైంది కూడా కాదని, ఆమోదయోగ్యం కూడా కాదని స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఆయన అమరావతిలోని ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
అమెరికలోని ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చినట్లుగా చెప్తున్న నివేదిక ఒరిజినల్ కాదని, ఫేక్ అని సదరు ల్యాబ్ అధికారులే వెల్లడించారని సునీల్ కుమార్ చెప్పారు. కొందరు బయటపెట్టిన అమెరికన్ ల్యాబ్ నివేదికను పరిశీలించి అదే ల్యాబ్ ఇచ్చిందేనా సర్టిఫై చేయాలని ప్రభుత్వం సూచనల మేరకు సదరు ల్యాబ్ను కోరిన మీదట మాకు అది ఫేక్ అని ల్యాబ్ అధికారులు మెయిల్ ద్వారా సమాధానమిచ్చినట్లు తెలిపారు. తన పేరుతో ఎవరో ఫేక్ రిపోర్ట్ ఇచ్చారని ల్యాబ్కు చెందిన జిమ్ చెప్పారన్నారు. మనం కూడా ఏదైనా వీడియో తీసి ల్యాబ్కు పంపి ఇది ఒరిజినలేనా అని అడిగితే.. మనం పంపింది ఒరిజనలే అని సమాధానమిస్తారని, అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పింది కూడా అదేనని గుర్తుచేశారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోకు సంబంధించి వాస్తవాలను మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెప్పారు. నివేదికను మార్ఫింగ్ చేసి ప్రచారం చేసినందున కొన్ని ఐటీ, ఐపీసీ సెక్షన్ల కింద నేరాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగిందని తెలిపారు. త్వరలో దీనిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఫేక్ వీడియోనుగానీ, ఫేక్ డాక్యుమెంట్నుగానీ సర్క్యులేట్ చేయడం నేరమని, ఈ వీడియో విషయంలో ఎవరెవరు ప్రచారం చేపట్టారో వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయన్నారు.