అమరావతి : ఏపీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా కడప జిల్లాలో పోలీసులు టీడీపీ, జనసేన నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. పలువురు ఇళ్ల ముందు పోలీసులు కాపలా కాశారు. రాజంపేటలో టీఎన్ఎస్ఎఫ్ ఏబీవీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్ట పోయిన ప్రాంతాలను, బాధితులను సందర్శించేందుకు కడపలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ పర్యటనలో వైసీపేతర పార్టీల నుంచి నిరసనలు తెలిపే అవకాశం ఉండడంతో పోలీసులు తెలుగుదేశం, జనసేన, ఏబీవీపీ, విద్యార్థి సంఘాల నాయకులపై నిఘా వేసి ఉంచారు. ముందస్తుగా కడపలో పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించగా మరికొందరిని గృహ నిర్భందం చేశారు. పోలీసుల తీరును టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.